ఉపరాష్ట్రపతి నివాసంలో సందడి.. సీపీ రాధాకృష్ణన్తో బండారు దత్తాత్రేయ కీలక భేటీ
February 18, 2026

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను హరియాణా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే, ప్రజా ప్రయోజనార్థం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భేటీ అనంతరం దత్తాత్రేయ ఉపరాష్ట్రపతికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.