హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల పేదలకు పండగ ముందే సొంతింటి కళ సాకారం
February 23, 2026

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల్లో సొంత స్థలం కలిగిన 18,000 మంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31వ తేదీలోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
దీనితో పాటు మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అందజేయనున్నారు. ఉగాది నాటికి మౌలిక సదుపాయాలతో కూడిన మొత్తం 50,000 గృహాలను లబ్ధిదారులకు అందించి, వారి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.