వందేమాతరం గీతం సాహిత్యంపై చెలరేగిన వివాదం అసలు కారణం ఇక్కడ చూడండి
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘వందేమాతరం’ తాజా మార్గదర్శకాల్లో జాతీయ గీత సాహిత్యాన్ని వక్రీకరించారని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనందమఠం’ నవలలోని అసలు సాహిత్యం కంటే ప్రభుత్వ నోటిఫికేషన్లోని పదాలు భిన్నంగా ఉన్నాయని పేర్కొంటూ ఆధారాలను బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి బెంగాలీ సంస్కృతిని మరియు ఋషి బంకిం చంద్రను అవమానించడమేనని తృణమూల్ నేతలు మండిపడుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాముఖ్యతను తగ్గించేందుకు బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు విమర్శించారు. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని తప్పనిసరి చేయడం వెనుక రాజకీయ పరమార్థం ఉందని వారు భావిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ నేతలు, దేశభక్తిని చాటిచెప్పే ప్రయత్నాన్ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.