భారత్ పాక్ పోరుపై బీసీసీఐ మౌనం వీడింది, ఐసీసీ నిర్ణయమే ఫైనల్ అంటూ కీలక ప్రకటన

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై సందిగ్ధత కొనసాగుతోంది. మొదట ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినప్పటికీ, ఇప్పుడు కొన్ని షరతులతో ఆడేందుకు సిద్ధమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో వాటా పెంపు, భారత్తో ద్వైపాక్షిక సిరీస్లు మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో తలపడాలనే నిబంధనలను పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు ఉంచింది. అయితే పాకిస్థాన్ పెట్టిన ఈ వింత షరతులను అంగీకరించేందుకు ఐసీసీ నిరాకరించినట్లు సమాచారం.
ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, పాక్ పెట్టిన షరతులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం పూర్తిగా ఐసీసీ పరిధిలో ఉందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకునే ఏ నిర్ణయానికైనా బీసీసీఐ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం తమ తదుపరి మ్యాచ్లపై దృష్టి సారించిందని, పాకిస్థాన్తో మ్యాచ్ విషయంలో ఐసీసీ ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని ఆయన వెల్లడించారు.