నిశ్చితార్థం ముగిశాక ప్రియుడితో పరారైన వధువు పెళ్లి వేడుకలో విషాదం నింపిన యువతి
February 10, 2026

ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. సునీల్ కుమార్ మరియు పల్లవిల వివాహ వేడుకలో భాగంగా మాలల మార్పిడి కార్యక్రమం ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు ఎంతో సంతోషంతో డాన్స్ చేస్తూ వేడుకను జరుపుకున్నారు. అయితే తెల్లవారుజామున అప్పగింతల సమయానికి వధువు గదిలో లేకపోవడంతో అందరూ షాక్కు గురయ్యారు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె జాడ దొరకలేదు.
వరుడి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అర్థరాత్రి సమయంలో వధువు తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోయినట్లు తేలింది. ఈ పెళ్లి కోసం వధువు కుటుంబం తమ భూమిని తాకట్టు పెట్టి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమె మొబైల్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.