దేశంలోనే తొలి హైస్పీడ్ నమో భారత్ రైలు పరుగులు ప్రారంభం
February 23, 2026

ఢిల్లీ నుండి మీరట్ వరకు 82 కిలోమీటర్ల దూరాన్ని అనుసంధానించే దేశపు మొట్టమొదటి రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ నమో భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలులో ప్రయాణ సమయం కేవలం 55 నిమిషాలు మాత్రమే. టికెట్ ధరలు 20 రూపాయల నుండి 210 రూపాయల వరకు ఉన్నాయి.
అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ రైలులో ఏసీ మరియు ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. రద్దీ సమయాల్లో ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒక రైలు నడపబడుతుంది. దీనితో పాటు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించే మీరట్ మెట్రో సేవలను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.