ఢిల్లీ పేలుళ్లలో జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నిర్ధారణ

ఢిల్లీ పేలుళ్లలో జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నిర్ధారణ

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రమేయం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టం చేసింది. 15 మంది మరణానికి కారణమైన ఈ దాడికి ఉగ్రవాదులే బాధ్యులని తన నివేదికలో పేర్కొంది. భారత్ అందించిన ఆధారాలను ఐక్యరాజ్యసమితి ఆమోదించడం పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది.

మసూద్ అజహర్ నేతృత్వంలో మహిళా ఉగ్రవాద విభాగం ఏర్పాటైందని, లక్నోలో అరెస్టయిన మహిళా వైద్యురాలికి ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ లేవనెత్తిన ఆందోళనలను అంతర్జాతీయ సమాజం గుర్తించడం గమనార్హం. ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఐక్యరాజ్యసమితి తీసుకున్న ఈ నిర్ణయం భారత్ సాధించిన దౌత్యపరమైన విజయంగా భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *