ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం, లోక్సభలో ప్రక్రియ ప్రారంభించాలని స్పీకర్ ఆదేశం

లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ తీర్మానంపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని లోక్సభ సెక్రటరీ జనరల్ను ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రక్రియను ప్రారంభించాలని ఆయన సూచించారు. మొత్తం 118 మంది విపక్ష సభ్యులు ఈ నోటీసుపై సంతకాలు చేసినట్లు సమాచారం.
అయితే, ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ఈ తీర్మానం నెగ్గడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 543 మంది సభ్యులున్న లోక్సభలో విపక్షాలకు తగిన మెజారిటీ లేకపోవడంతో, ఓం బిర్లాపై తెచ్చిన ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సంఖ్యాబలం తమకు అనుకూలంగా లేకపోయినా, స్పీకర్ పనితీరుపై నిరసన తెలుపుతూ విపక్షాలు ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.