ఆసుపత్రి ఐసియులో గ్యాంగ్స్టర్ కాల్చివేత, బీహార్లో శాంతిభద్రతలపై ప్రశ్నలు
July 17, 2025

పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక పేరుమోసిన నేరస్థుడిని పట్టపగలు కాల్చి చంపారు. గురువారం ఉదయం ఐదుగురు దుండగులు ఆసుపత్రిలోని ఐసియులోకి ప్రవేశించి, చందన్ మిశ్రా అనే రోగిని విచక్షణారహితంగా కాల్చివేసి పారిపోయారు. బక్సర్ జైలులో ఖైదీగా ఉన్న చందన్ ఇటీవల పెరోల్పై విడుదలయ్యాడు. గత కొన్ని వారాల్లో జరిగిన అనేక ప్రముఖుల హత్యల నేపథ్యంలో, ఈ సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.