నజ్రుల్ సమాధి వద్ద తీవ్రవాద నేత అంత్యక్రియలు! విప్లవ కవి వారసత్వానికి ముప్పు? కుటుంబం ఆగ్రహం
December 21, 2025

ఢాకా యూనివర్శిటీలోని జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే తీవ్రవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీని దహనం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై కవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నజ్రుల్ సమాధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
మత సామరస్యానికి ప్రతీక అయిన నజ్రుల్ పక్కన ఉగ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిని ఖననం చేయడం వెనుక దురుద్దేశం ఉందని వారు ఆరోపించారు. భవిష్యత్తులో అక్కడ కవి సమాధి కూడా ఉండనివ్వరేమోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.