NRIలకు ఓటు హక్కు లభిస్తుందా? చాలా కాలంగా ఉన్న ఈ కల నిజమయ్యే అవకాశం

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ మరియు తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ప్రవాస భారతీయలు (NRIs) పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం పొందవచ్చు. ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది, దీని తర్వాత భారత ఎన్నికల సంఘం (ECI) తుది నిర్ణయం తీసుకోవచ్చు. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల నుండి ఈ డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల వాడకంపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఇ-ఓటింగ్ను మాత్రం తాము సమర్థించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం లభించిన తర్వాత, ECI ఈ సదుపాయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పారామిలటరీ సిబ్బందికి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగంలో ఉన్నాయి. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, 2026 నుండి విదేశాలలో నివసించే NRIలకు ఓటు వేసే అవకాశం లభించే అవకాశం ఉంది.