24 ఏళ్ల నిరీక్షణకు తెర.. నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలుగు చిత్ర పరిశ్రమను ఒకప్పుడు కుదిపేసిన నటి ప్రత్యూష మరణం కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. సుదీర్ఘంగా సాగిన ఈ న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు సిద్ధార్థరెడ్డిని దోషిగా తేలుస్తూ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించింది.
సిద్ధార్థరెడ్డికి జైలు శిక్ష ఖరారు
నటి ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి ప్రేరణే కారణమని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. వచ్చే నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. మెడికల్ రిపోర్టులు మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల ప్రకారం ఇది విషప్రయోగం వల్ల జరిగిన మరణమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఏం జరిగిందంటే?
2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష మరియు సిద్ధార్థరెడ్డి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగగా, సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడగా ప్రత్యూష మాత్రం మరుసటి రోజే ప్రాణాలు విడిచింది. ఆత్మహత్య ఒప్పందంలో ఒకరు బతికితే, చట్టపరంగా ఆ వ్యక్తిని దోషిగా పరిగణించాలన్న నిబంధన మేరకు ఈ తీర్పు ఇచ్చారు.
కన్నీరుమున్నైన్ ప్రత్యూష తల్లి
కోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె వాదించారు. “నాకు న్యాయం జరగలేదు. సిద్ధార్థరెడ్డికి జీవిత ఖైదు పడుతుందని ఆశించాను. సాక్ష్యాలను ముందే తారుమారు చేశారు” అంటూ ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.