సంజూ శాంసన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా రియాన్ పరాగ్ ఎంపిక
February 13, 2026

ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో భారీ మార్పు జరిగింది. స్టార్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరడంతో, అసోం ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ను కొత్త సారథిగా యాజమాన్యం ప్రకటించింది. గత సీజన్లో జట్టును నడిపించిన అనుభవం ఉన్న పరాగ్పై ఫ్రాంచైజీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది.
గత ఏడు సీజన్లుగా జట్టుతో ఉన్న పరాగ్, బ్యాటింగ్లోనూ అద్భుత ఫామ్లో ఉన్నారు. గత సీజన్లో 393 పరుగులు చేసిన ఆయన, నాయకుడిగా జట్టును విజయపథంలో నడిపిస్తారని యాజమాన్యం భావిస్తోంది. కొత్త సీజన్లో పరాగ్ నాయకత్వంలో టైటిల్ గెలవాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలతో ఉంది.