మహా శివరాత్రి నాడు ఆలయం నుండి ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే మీ దారిద్ర్యం తొలగి అదృష్టం వరిస్తుంది
February 13, 2026

మహా శివరాత్రి పర్వదినాన శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి సమర్పించిన బిల్వ పత్రాన్ని ఇంటికి తెచ్చుకోవడం అత్యంత శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ పత్రాన్ని బీరువాలో లేదా పర్సులో ఉంచుకోవడం వల్ల అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
అలాగే పార్వతీ దేవికి సమర్పించిన సింధూరం లేదా గాజులను ధరించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. శివుడి అభిషేక తీర్థాన్ని ఇంటిలో చల్లడం ద్వారా ప్రతికూల శక్తులు దూరమై కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు.