భోపాల్ స్నూకర్ క్లబ్‌లో పదో తరగతి విద్యార్థిపై 27 సార్లు కత్తితో దాడి చేసిన సహచరులు

భోపాల్ స్నూకర్ క్లబ్‌లో పదో తరగతి విద్యార్థిపై 27 సార్లు కత్తితో దాడి చేసిన సహచరులు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక స్నూకర్ క్లబ్‌లో పదో తరగతి విద్యార్థిపై కేవలం 30 సెకన్లలో 27 సార్లు కత్తితో దాడి చేసిన భయంకరమైన ఘటన వెలుగుచూసింది. గతంలో జరిగిన ఘర్షణలో బాధితుడు నిందితులను కొట్టినందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులు సినీ ఫక్కీలో క్లబ్‌లోకి ప్రవేశించి 16 ఏళ్ల బాలుడిని కోణంలో బంధించి విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

మరింత విచారకరమైన విషయం ఏమిటంటే నిందితులు ఈ దాడికి సంబంధించిన సిసిటివి దృశ్యాలను సోషల్ మీడియాలో స్వయంగా వైరల్ చేశారు. బాధితుడు మరియు నిందితులు ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై గౌతమ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య నివేదిక అందిన తర్వాత నిందితులపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్‌స్పెక్టర్ మణిపాల్ సింగ్ భదోరియా వెల్లడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *