బంగారం ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
February 23, 2026

అంతర్జాతీయ మార్కెట్లో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని ఆమె ఆర్బీఐ బోర్డు సమావేశం తర్వాత వెల్లడించారు.
దిగుమతులపై ఆధారపడటం మరియు పెళ్లిళ్ల సీజన్ వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ సుంకాల అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తుండటంతో మార్కెట్లో ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి.