ప్రేయసి పెళ్లిని సహించలేక పార్సిల్ బాంబు పంపిన యువకుడు
August 18, 2025

ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ ఛుయికాదన్ గండై జిల్లాలో సంచలనాత్మక ఘటన జరిగింది. తన మాజీ ప్రేయసికి వేరొకరితో పెళ్లయిందని కోపంతో ఓ యువకుడు ఆమె అత్తమామల ఇంటికి పార్సిల్ బాంబు పంపి అందరినీ చంపాలని ప్లాన్ చేశాడు. ఈ ఘటనలో ప్రేమికుడితో సహా మొత్తం 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ (20)గా గుర్తించబడ్డాడు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వినయ్ ఆన్లైన్లో బాంబు తయారీ పద్ధతులను నేర్చుకుని, సుమారు 2 కిలోల ఐఈడీని హోమ్ థియేటర్లో అమర్చి పార్సిల్గా పంపాడు. అయితే, సాంకేతిక లోపం కారణంగా బాంబు పేలలేదు. కుటుంబం అనుమానాస్పద పార్సిల్ గురించి వెంటనే పోలీసులకు తెలియజేయగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేసి, మొత్తం కుట్రను బయటపెట్టారు. హత్యాయత్నం మరియు పేలుడు పదార్థాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేయబడ్డాయి.