ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం
February 13, 2026

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి ముందే ‘వందేమాతరం’ ఆలపించడం తప్పనిసరి. బంకిం చంద్ర ఛటర్జీ అమర సృష్టికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, వందేమాతరంలోని ఆరు చరణాలను నిర్ణీత 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో పాడాల్సి ఉంటుంది. జెండా ఎగురవేసే సమయం నుండి రాష్ట్రపతి ప్రసంగం వరకు అన్ని సందర్భాల్లోనూ ఇది వర్తిస్తుంది.
అయితే ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు చేపట్టారని తృణమూల్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన బిజెపి, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, జాతీయ గీతానికి తగిన గౌరవం కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.