పాకిస్థాన్ మ్యాచ్కు అభిషేక్ శర్మ దూరం కానున్నారా ఆందోళనలో క్రికెట్ అభిమానులు
February 13, 2026

అనారోగ్యం నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ పాకిస్థాన్తో జరిగే కీలక మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఇన్ఫెక్షన్ కారణంగా తన బరువు గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని అభిషేక్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఒక వీడియోలో ఈ యువ ఓపెనర్ చాలా నీరసంగా కనిపించడం అభిమానులను కలవరపెడుతోంది.
ఢిల్లీలో తన తల్లిదండ్రులతో ఉన్న అభిషేక్ శారీరక దృఢత్వంపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, కీలకమైన ఈ మ్యాచ్లో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా అభిషేక్ లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.