నొప్పి తగ్గాలని వేసుకున్న మాత్రలే ప్రాణాలు తీశాయి సూర్యాపేటలో విషాదం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక సామాన్య కూలీ ప్రాణం పెయిన్ కిల్లర్ల వల్ల అనంతవాయువులో కలిసిపోయింది. భగత్సింగ్ నగర్కు చెందిన పుల్లూరి కనకయ్య (60) అనే వ్యక్తి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఇటీవల అదే కాలుకు మళ్లీ గాయం కావడంతో నొప్పి తీవ్రమైంది. ఆ భరించలేని నొప్పి నుంచి ఉపశమనం పొందాలని ఆయన సోమవారం పరిమితికి మించి నొప్పి నివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) మింగేశారు.
మాత్రలు వేసుకున్న రెండు గంటలకే కనకయ్య తీవ్ర నీరసానికి గురయ్యారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. అధిక మోతాదులో డ్రగ్స్ (పెయిన్ కిల్లర్స్) తీసుకోవడం వల్లే అంతర్గత అవయవాలపై ప్రభావం పడి మరణం సంభవించిందని వైద్యులు ధృవీకరించారు. పట్టణ సీఐ వెంకటయ్య ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. స్వల్ప ఉపశమనం కోసం వైద్యుల సలహా లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.