తేజస్ యుద్ధ విమానాలపై భారత వాయుసేన సంచలన నిర్ణయం
February 23, 2026

సాంకేతిక లోపాల కారణంగా ఇటీవల జరిగిన ప్రమాదం దృష్ట్యా తేజస్ యుద్ధ విమానాల కార్యకలాపాలను భారత వాయుసేన తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా కారణాల రీత్యా మొత్తం 30 సింగిల్ సీట్ జెట్స్ను తనిఖీల కోసం పక్కనపెట్టినట్లు సమాచారం. శిక్షణ సమయంలో జరిగిన ఈ ప్రమాదం నుండి పైలట్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
వాయుసేనలో చేరిన తర్వాత తేజస్ ప్రమాదానికి గురవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో జైసల్మేర్ మరియు దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో, తాజా ఘటనపై లోతైన విచారణకు ఆదేశించారు. ఈ సాంకేతిక సమస్యలపై స్పష్టత వచ్చే వరకు వీటి వినియోగానికి విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది.