ట్రంప్ టారిఫ్ నిర్ణయం అక్రమమని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు భారత్కు వేల కోట్ల రూపాయల భారీ లబ్ధి

న్యూస్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధించిన అదనపు సుంకాలను (టారిఫ్) అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసింది. పన్నులు విధించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుందని, అధ్యక్షుడికి కాదని కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల అమెరికాకు ఎగుమతులు చేసే భారతీయ వ్యాపారులపై భారం తగ్గనుంది. సామాన్య ప్రజల విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటమే కాకుండా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊరటనిస్తుంది.
ఈ తీర్పుతో అమెరికా ఇప్పటివరకు వసూలు చేసిన సుమారు 175 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై విధించిన పెనాల్టీ సుంకాలు కూడా ఇప్పుడు రద్దవుతాయి. దీనివల్ల భారత్కు దాదాపు 40 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు రీఫండ్ రూపంలో వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించడం తమ దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతుందని ట్రంప్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు.