టాటా గ్రూప్ షేర్ల జోరు కేవలం 5 రోజుల్లోనే 18 శాతం లాభం మీ దగ్గర ఉందా
February 22, 2026

న్యూస్ డెస్క్ : టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్లు ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజుల్లోనే ఈ షేరు ధర 18 శాతం పెరగడం సామాన్య ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఎన్. చంద్రశేఖరన్ మరోసారి టాటా సన్స్ బాధ్యతలు చేపట్టవచ్చనే వార్తలతో ఈ షేర్ల విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం, ఈ షేరు త్వరలోనే 830 నుండి 850 రూపాయల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో ఇది ఏకంగా 569 శాతం లాభాలను అందించి సామాన్యుల సంపదను పెంచింది. అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి కాబట్టి, డబ్బులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.