ఓలా మరియు ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అమిత్ షా భారత్ టాక్సీ

ఓలా మరియు ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అమిత్ షా భారత్ టాక్సీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో డ్రైవర్లతో సమావేశమై భారత్ టాక్సీ సేవలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార రంగంలో ప్రారంభమైన ఈ సేవల్లో డ్రైవర్లే యజమానులని, ఈ వ్యవస్థ పూర్తిగా స్థిరపడటానికి మూడేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. అంతవరకు డ్రైవర్లు ఓపికతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

అముల్ మరియు నాబార్డ్ సహకారంతో నడుస్తున్న ఈ యాప్ ఆధారిత సేవల్లో డ్రైవర్ల నుండి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రైవేట్ సంస్థల వలె పీక్ అవర్ ఛార్జీలు ఉండవని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *