ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరిక

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరిక

ఓటర్ల జాబితా సవరణ మరియు ఎన్నికల విధుల్లో అధికారులు ఏవైనా తప్పులు చేస్తే వాటిని నేరుగా కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం పరిశీలకులను ఆదేశించింది. పారదర్శకతను పెంపొందించేందుకు క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై నిశితంగా నిఘా ఉంచాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేసింది.

అనర్హమైన పత్రాలను ధృవీకరించే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించింది. ఐటీ బృందం కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడవద్దని కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *