ఇరాన్ యుద్ధ భయంతో భారత్ సంచలన నిర్ణయం వెనువెంటనే వచ్చేయాలని ఆదేశం
February 23, 2026

ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు మరియు వ్యాపారులు తక్షణమే ఇరాన్ను వీడి స్వదేశానికి రావాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
అమెరికాతో జరగనున్న అణు ఒప్పంద చర్చలు విఫలమైతే దాడులు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భారతీయులు తమ గుర్తింపు పత్రాలతో సిద్ధంగా ఉండాలని, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉంటూ వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వదలాలని కేంద్రం స్పష్టం చేసింది.