ఇంధన సమస్యపై భారత్కు మద్దతుగా రష్యా, ట్రంప్కు గట్టి సందేశం
August 6, 2025

రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్పై అమెరికా సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్న నేపథ్యంలో, రష్యా భారత్కు అండగా నిలిచింది. భారత్ తన నిర్ణయాలు తాను తీసుకోగలదని మాస్కో స్పష్టం చేసింది. ఏ సార్వభౌమ దేశానికైనా దాని ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ దేశంతోనైనా వ్యాపారం చేసే హక్కు ఉందని, ఈ రకమైన ఒత్తిడిని క్రెమ్లిన్ చట్టవిరుద్ధమని భావిస్తుంది.
రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అమెరికా చర్యను ‘కొత్త సామ్రాజ్యవాద ఎజెండా’గా అభివర్ణించారు. సుంకాలు విధించడం ద్వారా చరిత్రను మార్చలేమని ఆమె అన్నారు. బ్రిక్స్, గ్లోబల్ సౌత్ వంటి భావసారూప్య మిత్రులతో భారత్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, తన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకోవడానికి ఎలాంటి రాజీపడబోమని భారత్ కూడా ప్రకటించింది.