అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం టీమ్ ఇండియా చేసిన హిమాలయ తప్పా అశ్విన్ ఫైర్
February 23, 2026

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర ఓటమి తర్వాత జట్టు ఎంపికపై రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను కాదని వాషింగ్టన్ సుందర్ను తీసుకోవడం జట్టు వ్యూహాత్మక తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని అశ్విన్ విమర్శించారు.
అక్షర్ పటేల్ జట్టుకు ’24 క్యారెట్ల బంగారం’ వంటివాడని, అటువంటి ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయడం దురదృష్టకరమని అశ్విన్ అన్నారు. సుందర్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ అతడితో బౌలింగ్ చేయించకపోవడం యాజమాన్యం వైఫల్యమని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితి ఏనుగు తన తలపై తానే మట్టి పోసుకున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.