BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు లేకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉండేదే కానని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఒక్కో కేసీఆర్‌లా మారాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ప్రజా సమస్యలపై పోరాడే నేతగా ఎదగాలని సూచించారు.

మోదీ తన మెడపై కత్తిపెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనకడుగు వేయనని స్పష్టంగా తెలిపారు. తెలంగాణ సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికీ పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ భవిష్యత్తును బీఆర్ఎస్‌పై నమ్మి ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *