IPL 2025: కోహ్లీకి కొత్త ఓపెనింగ్ పార్టనర్! ఆర్సీబీ జట్టులో ఎవరు ఉంటారు?

IPL 2025: కోహ్లీకి కొత్త ఓపెనింగ్ పార్టనర్! ఆర్సీబీ జట్టులో ఎవరు ఉంటారు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ సారి కొత్త నాయకత్వంతో బరిలోకి దిగుతోంది. ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేయకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రజత్ పాటిదార్‌కు అప్పగించారు. దీంతో ఓపెనింగ్ కాంబినేషన్ కూడా మారింది. విరాట్ కోహ్లీ కొత్త ఓపెనింగ్ భాగస్వామిగా ఫిల్ సాల్ట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గత సీజన్‌లో ఫిల్ సాల్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడాడు.

IPL 2025 మార్చి 22న ప్రారంభంకానుంది, మొదటి మ్యాచ్‌లోనే ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అయితే, మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగలవచ్చు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో ఉన్నందున, అతను ఆడతాడా అనేది అనిశ్చితంగా ఉంది. అయితే, బ్యాటింగ్ విభాగం బలపడింది. లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగాన్ని అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ నేతృత్వం వహించనున్నాడు. స్పిన్నర్ అవసరమైతే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాష్ శర్మకు అవకాశం ఉండొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *