‘మా IQ బీజేపీ కార్యకర్తల మాదిరిగా కాదు’ ఈసీ వాదనలు హాస్యాస్పదమన్న మహువా

‘మా IQ బీజేపీ కార్యకర్తల మాదిరిగా కాదు’ ఈసీ వాదనలు హాస్యాస్పదమన్న మహువా

‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలపై ఎన్నికల సంఘం (EC) ఇచ్చిన వివరణను ‘హాస్యాస్పదమని’ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చేసిన రెండు ప్రకటనలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ‘సార్, మా IQను బీజేపీ కార్యకర్తల మాదిరిగా అనుకోవద్దు’ అని ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు.

బీహార్ ముసాయిదా జాబితాలో దాదాపు 22 లక్షల మంది మరణించిన ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎందుకంటే, కొన్ని నెలల క్రితమే ఓటరు జాబితా సవరించబడింది. గత కొన్ని సంవత్సరాల డేటా ఆధారంగా ఈ మరణించిన ఓటర్లను తొలగించినట్లయితే, ఇన్నాళ్లు వారి పేర్లు జాబితాలో ఎందుకు ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. దీనికి ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని మోయిత్రా పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *