ట్రంప్కు మోడీ కౌంటర్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోలేదు
August 3, 2025

దేశ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు. ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ‘చచ్చిపోయింది’ అని పేర్కొన్నారు. దీనికి బదులిస్తూ, భారతదేశం త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ప్రధానమంత్రి తెలిపారు.
శనివారం తన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాల గురించి జాగ్రత్తగా ఉంటుంది’ అని అన్నారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడంపై ట్రంప్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైనవన్నీ చేస్తున్నామని ప్రధానమంత్రి ధృవీకరించారు.