భాష పేరుతో రాజకీయం అందుకే? అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాషపై రాజకీయం చేస్తున్న కొన్ని పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు భాషను రాజకీయ ఎజెండాగా మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. దక్షిణాది భాషలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, కానీ ఆ ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి భాషకు సమాన గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
తమిళనాడులో NDA అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ప్రాధాన్యత గల విద్యా కోర్సులను తమిళ భాషలో అందుబాటులోకి తెస్తామని అమిత్ షా తెలిపారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము కృషి చేస్తున్నామని, స్థానిక భాషలో విద్య అందించడమే విద్యార్థులకు మేలు చేస్తుందని వివరించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు భాషను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం బాధాకరమని ఆయన అన్నారు.