రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు
March 22, 2025

రాష్ట్ర రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలనా అధికారుల (VRO) పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ పోస్టులను ప్రధానంగా మాజీ వీఆర్వోలు (VROలు), మాజీ గ్రామ సహాయకులు (VRAలు) కోసం కేటాయించనున్నారు. నియామక ప్రక్రియను సులభతరం చేసేందుకు వారికి ఆప్షన్లు తీసుకుని పోస్టులను కేటాయించనున్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ సేవలను మెరుగుపరచడానికి, గ్రామస్థాయిలో పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించడానికి ఈ ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అతి త్వరలో నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.