దిశా సాలియాన్ డెత్ కేసు: ఏప్రిల్ 2న విచారణ

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మరణానికి సంబంధించి, ఆమె తండ్రి సతీశ్ సాలియాన్ వేసిన రిట్ పిటిషన్పై బాంబే హైకోర్టు ఏప్రిల్ 2న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూన్ 8న దిశా ముంబైలో అప్రత్యక్ష పరిస్థితుల్లో మృతి చెందగా, ఆమె కుటుంబం ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు జరిపించాలని కోరుతోంది. కేసులో అనేక అనుమానాస్పద కోణాలు ఉన్నాయని, అసలు నిజాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె తండ్రి కోర్టులో వాదనలు వినిపించారు.
ఈ కేసు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో సంబంధం ఉందని అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ కేసులో కీలక వ్యక్తి కావచ్చని, సాక్ష్యాలను తారుమారు చేయడం జరిగిందని సతీశ్ సాలియాన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీసుకునే నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది.