డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నిర్వహించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని జనసేన పార్టీ స్పష్టం చేసింది. అయితే, వేర్వేరు రాజకీయ కూటముల్లో భాగంగా ఉన్నందున ఆ సమావేశానికి హాజరుకాలేదని పేర్కొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన మేరకు ఈ విషయాన్ని డీఎంకేకు అధికారికంగా తెలియజేశామని తెలిపారు.

ఈ సమావేశానికి జనసేన ప్రతినిధులు హాజరైనట్లు కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ, అవన్నీ అసత్యమని పార్టీ ఖండించింది. డీలిమిటేషన్‌పై తమకు ప్రత్యేకమైన దృష్టికోణం ఉందని, అయితే దాన్ని సరైన అధికారిక వేదికలో మాత్రమే వెల్లడిస్తామని జనసేన పేర్కొంది. పార్టీ విధానంపై ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *