మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు?: కేటీఆర్

మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు?: కేటీఆర్

ఈ-కార్ రేసుకు రూ.46 కోట్లు ఖర్చు చేశారని విమర్శించిన వారు, ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల కోసం రూ.54 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఈ-రేస్ ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని, అయితే మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఎలాంటి ఆదాయం వస్తుందో ప్రజలకు వివరించాలని మంత్రి జూపల్లిని నిలదీశారు.

రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వేసవిలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి పోటీలు నిర్వహించడం సమంజసం కాదని కేటీఆర్ విమర్శించారు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయాలు పక్కన పెట్టి, ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలకు కోట్లు వెచ్చించడం తగదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *