IPL: రేపు హైదరాబాద్లో మ్యాచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రేపు రెండో మ్యాచ్ జరగనుంది. హోం జట్టు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, రెండు జట్లు కూడా విజయంతో తమ సీజన్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. క్రీడాభిమానులు స్టేడియానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 2700 మంది పోలీసులను మొహరించారు. అదనంగా, 450 సీసీ కెమెరాల ద్వారా స్టేడియం మొత్తం నిఘా పెట్టనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 19 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మ్యాచ్కు హాజరయ్యే అభిమానులు ట్రాఫిక్ నియమాలను పాటించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.