‘మన ఊరు-మన బడి’ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి: అక్బరుద్దీన్
March 26, 2025

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ స్కీమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మిగతా అవినీతి కేసులన్నింటికంటే ఈ స్కామ్ చాలా పెద్దదని పేర్కొన్నారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 4,823 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థినులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ అన్నారు.