‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు విడుదల
March 26, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఐదు సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందేందుకు అర్హత కలిగివుంటుంది. లబ్ధిదారుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి. రేషన్ కార్డు లేనివారు తమ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఈ పథకంలో మహిళలకు 25% రిజర్వేషన్ కల్పించగా, దివ్యాంగులకు 5% కోటా ఉంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదనంగా, అమరవీరుల కుటుంబాలు, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత పొందుతారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే జరగనుంది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను సమర్పించవచ్చు.