వడ్డీలకే రూ.27వేల కోట్ల చెల్లింపు: CAG
March 31, 2026

TG: FY2025-26లో ప్రభుత్వం అప్పులకు వడ్డీల కిందే రూ.27,803 కోట్లు చెల్లించింది. కాగ్ తాజా నివేదిక దీన్ని వెల్లడించింది. ఇది రాష్ట్ర ఆదాయంలో 12.74% గా ఉందని తెలిపింది. వేతనాల కింద రూ.30000 కోట్లు, పెన్షన్ల కింద రూ.16,942 కోట్లు వెచ్చించిందని పేర్కొంది. కాగా రాష్ట్ర లోటు బడ్జెట్ రూ.71000 కోట్లుగా ఉంది. అంచనా బడ్జెట్ రూ.2.48 లక్షల కోట్లు కాగా వాస్తవిక బడ్జెట్ రూ.1.77 లక్షల కోట్లుగా కాగ్ తేల్చింది.