డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్కు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని, ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్యం సమానంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య తగ్గే అవకాశముందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో ఉత్తరాది రాష్ట్రాల ప్రభావాన్ని మరింత పెంచుతుందని, సమతుల్యత క్షీణించే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ మాటలు, చేతలు పొంతన లేకుండా ఉన్నాయని ఆయన విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం ఈ విషయంలో కూటమిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.