అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ మైథలాజికల్ కథ!

ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇటీవలే హైప్గా ఉన్న తన తాజా సినిమా మ్యాడ్ స్వ్కేర్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఇందులో నాగవంశీ ఒక పాత్రలో కూడా నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న మరో ప్రాజెక్ట్ గురించి వివరాలు ఇచ్చారు. ఈ చిత్రం ఒక మైథలాజికల్ కథ కాబట్టీ, ప్రేక్షకులకు కొత్తగా తెలియని దేవతల కథనాలను ఆధారంగా చేసుకుంటుందని ఆయన తెలిపారు.
ఇండియన్ సినిమాల్లో ఇటీవల మైథలాజికల్ కథలు తక్కువగా వచ్చే విషయాన్ని సూచించిన నాగవంశీ, “మేము ఇప్పుడు అదే కాన్సెప్ట్తో వస్తున్నాం” అని స్పష్టం చేశారు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం ఒక ప్రసిద్ధ దేవుని జీవితంపై ఆధారపడి ఉంటుందని, కానీ దానిలో అనేక అజ్ఞాత విషయాలు ఉండబోతున్నాయని ఆయన చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతేకాక, మ్యాడ్ స్వ్కేర్ హిట్ అయితే దీనికి మూడో పార్ట్ని కూడా తీయాలని నాగవంశీ భావిస్తున్నారు. అయితే, బన్నీ మరియు త్రివిక్రమ్ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో అనేది ఇంకా క్లియర్ కాలేదు.