ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

ఈరోజుల్లో చాలా మంది భోజనం చేస్తూనే ఫోన్‌లో మునిగిపోతున్నారు. సోషల్ మీడియా చూసుకోవడం, వీడియోలు చూడడం లేదా మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వడం అలవాటుగా మారింది. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినే సమయంలో మనసు పూర్తిగా ఆహారంపైనే ఉండాలని వారు సూచిస్తున్నారు. ఫోన్‌పై దృష్టి కేంద్రీకృతం అయితే, ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా తెలియదు.

దీని ప్రభావం మెల్లిగా శరీరంపై పడుతుంది. తినే పద్ధతి సరిగ్గా లేకపోతే అరిగింపు సమస్యలు వస్తాయి. తినే తిండి మీద శ్రద్ధ లేకపోతే పోషకాహార లోపం ఏర్పడి శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు తగ్గిపోతాయి. మరికొందరిలో మాత్రం అదుపు లేకుండా ఎక్కువ తినడం అలవాటవ్వడంతో ఊబకాయం సమస్యగా మారుతుంది. ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి భోజనం చేస్తూనే ఫోన్ వాడే అలవాటును తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *