డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనాభా ఆధారంగా లోక్‌సభ, రాజ్యసభ స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాలని కోరారు.

పార్లమెంటరీ విధాన నిర్ణయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యతను తగ్గించేలా ఏ నిర్ణయమూ ఉండకూడదని జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించేలా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *