కల్తీ నెయ్యి వివాదంలో కూటమి సర్కార్ నయా వ్యూహం అసెంబ్లీ వేదికగా జగన్ సవాల్
February 23, 2026

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుప్రీంకోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో, ఈ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిపి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ వ్యూహాలకు ప్రతివ్యూహంతో సిద్ధమైన మాజీ సీఎం జగన్, అసెంబ్లీలో చర్చకు తాను స్వయంగా హాజరవుతానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి టెండర్ల అంశంపై సభ వేదికగా వాస్తవాలను వెల్లడించేందుకు వైసీపీ సిద్ధం కావడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.