రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది.. 10 రాష్ట్రాల్లోని 37 సీట్ల కోసం మార్చి 16న పోలింగ్

రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది.. 10 రాష్ట్రాల్లోని 37 సీట్ల కోసం మార్చి 16న పోలింగ్

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన రెండు కీలక స్థానాలు కూడా ఉన్నాయి.

ముఖ్యమైన వివరాలు ఇవే

తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. అలాగే మహారాష్ట్రలో అత్యధికంగా ఏడుగురు ఎంపీలు ఏప్రిల్ 2న రిటైర్ కానున్నారు. ఇతర రాష్ట్రాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి

  • మహారాష్ట్ర: 07
  • తమిళనాడు: 06
  • పశ్చిమ బెంగాల్: 05
  • బీహార్: 05
  • ఒడిశా: 04
  • అస్సాం: 03
  • తెలంగాణ: 02
  • ఛత్తీస్‌గఢ్: 02
  • హర్యానా: 02
  • హిమాచల్ ప్రదేశ్: 01

ఎన్నికల షెడ్యూల్

  • నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5
  • ఉపసంహరణకు గడువు: మార్చి 9
  • పోలింగ్ తేదీ: మార్చి 16 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు)
  • ఫలితాల ప్రకటన: మార్చి 16 (సాయంత్రం 6 గంటల తర్వాత)

ఏప్రిల్‌లో 37 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *