సేవా తీర్థ్ ప్రారంభోత్సవంలో వికసిత భారత్ కోసం ప్రధాని మోదీ కీలక సందేశం
February 13, 2026

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయం మరియు క్యాబినెట్ సెక్రటేరియట్లతో కూడిన కొత్త సేవా తీర్థ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కొత్త చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి బానిసత్వ చిహ్నాలకు స్వస్తి పలికి స్వతంత్ర భారత విధాన నిర్ణయాలకు ఈ భవనం వేదికగా నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
విజయ ఏకదశి పర్వదినాన ఈ కొత్త ప్రస్థానం ప్రారంభం కావడం శుభసూచకమని మోదీ అన్నారు. దైవిక ఆశీస్సులతో వికసిత భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాత కాలనీయల్ నిర్మాణాల స్థానంలో వచ్చిన ఈ సేవా తీర్థ్ దేశ సేవలో కీలక పాత్ర పోషిస్తుందని మరియు భవిష్యత్తు భారతావని ఆకాంక్షలకు ప్రతిరూపమని కొనియాడారు.