చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆటకు లైన్ క్లియర్ చేసిన కర్ణాటక ప్రభుత్వం
February 13, 2026

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై ఉన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. ప్రజా భద్రత మరియు ప్రేక్షకుల రాకపై కొన్ని నిబంధనలతో కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ మ్యాచ్లకు పచ్చజెండా ఊపింది. జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా నివేదిక సిఫార్సుల మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ముప్పై ఐదు వేల మంది సామర్థ్యం గల ఈ స్టేడియంలో రద్దీ నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ వేదికల ఆలోచనను పక్కన పెట్టి సొంత గడ్డపైనే ఆడే అవకాశం రావడంతో ఆర్సీబీ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కోహ్లీ సేన చిన్నస్వామిలో గర్జించడానికి సిద్ధమైంది.