పాకిస్థాన్ మ్యాచ్కు ముందు నమీబియాపై భారత్ ఘనవిజయం
February 13, 2026

టీ20 ప్రపంచకప్లో నమీబియాపై 93 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 116 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ పాండ్యా (52) మెరుపు ఇన్నింగ్స్లతో భారత్ భారీ స్కోరు సాధించింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడి చేశారు.
అభిషేక్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన సంజూ శాంసన్ 22 పరుగులకే వెనుదిరిగినప్పటికీ, ఇషాన్ కిషన్ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ 4 వికెట్లు తీసి భారత్ను నియంత్రించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అమెరికాపై విజయం తర్వాత వరుసగా రెండో గెలుపును నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు దాయాది పాకిస్థాన్తో తలపడేందుకు సిద్ధమైంది.